కార్తీక పురాణం! (వింశాధ్యాయము - ఇరవయ్యవ రోజు పారాయణం)


పురంజయుడు దురాచారుడగుట:

జనక మహారాజు, చతుర్మాస్య వ్రత ప్రభావము వినిన పిమ్మట వశిష్టునితో " గురువర్యా! కార్తీక మాస మహాత్మ్యమును యింకను వినవలయుననెడి కోరిక కల్గుచున్నది. ఈ వ్రత మహాత్మ్యము నందింకను విశేషములు గలవా! యను సంశయము గూడా కలుగుచున్నది. ఈ నా సంశయ నివారణ కొరకు, మరిన్ని వుదాహరణలు వినిపించి, నన్ను కృతార్దునిగా జేయు"డనెను. అ మాటలకు వశిష్టుల వారు మంద హాసముతో "ఓ రాజా! కార్తీక మాస మహాత్మ్యము గురించి, అగస్త్య మహాముని, అత్రి మునికి జరిగిన ప్రసంగ మొకటి కలదు. దానిని వివరించెదను ఆలకించు"మని, అ కథా విధానమును యిట్లు వివరించిరి. పూర్వ మొకప్పుడు, అగస్త్య మహర్షి, అత్రి మహర్షిని గాంచి, "ఓ అత్రి మహామునీ! నీవు విష్ణువు అంశయందు బుట్టి నావు. కార్తీక మహాత్మ్యమును గూర్చి నీకు ఆ ములాగ్రము తెలియును. కాన, దానిని నాకు వివరింపుము" అని కోరెను.

అంత అత్రిమహముని "కుంభ సంభవా! నీ వడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రితికరముగుటచే నుత్త మమయిన ది. కార్తీక మాసముతో సమాన ముగ మాసము. వేద ముతో సమాన మగు శాస్త్రము. ఆరోగ్య సంపదకు సాటి యగు సంపద లేదు. అటులనే శ్రీమన్నారాయణుని కంటె వేరు దేవుడు లేడు. ఏ మానవుడైనను కార్తీక మాసమును నదిలో స్నానము చేసినను, శివకేశవుల ఆలయమందు దీపారాధన చేసినను, లేక దీపదానము చేసినను గలుగు ఫలితము అపారము. ఇందుకొక యితిహాసము వినుము. త్రేతాయుగమున పురంజయుడను సూర్య వంశపు రాజు, అయోధ్యా నగరమును రాజధానిగా చేసుకొని, రాజ్యమేలుచుండెను. అతడు సమస్త శాస్త్రములు చదివి, పట్టభిషిక్తుడై న్యాయముగా రాజ్యపాలన చేసెను. 

ప్రజలకెట్టి యా పదలు రాకుండ పాలించుచుండెను. అట్లుండ కొంత కాలమునకు పురంజయుడు అమిత ధనాశ చేతును, రాజ్యాధికార గర్వముచెతను జ్ఞాన హినుడై దుష్ట బుద్ది గలవాడై, దయాదాక్షి ణ్యములు లేక దేవ బ్రాహణ మాన్యములు లాగుకొని, పరమలోభి యై, చోరులను జేరదీసి వారిచే దొంగతనములు దోపిడీలు చేయించుచు దొంగలు కొల్ల గొట్టుకొని వచ్చిన ధనములో సగమువాటా తీ సికోనుచు ప్రజలను భి తావ హులను చేయుచుండెను. ఇటుల కొంత కాలము జరుగగా, అతని దౌష్ట్య ములు నలుదిక్కులా వ్యాపించెను. ఈ వార్త కాంభోజ రాజును నాయకునిగా చేసుకోని రధ, గజ, తురగ, పదాతి సైన్య బలా న్వితులైర హస్యమార్గము వెంట వచ్చి అయోధ్య నగర మును ముట్టడించి, నలు వైపులా శిబిరములు నిర్మించి నగరమును దిగ్భ౦ధముచేసి యుద్దమునకు సిద్దపడిరి.

అయోధ్యా నగరమును ముట్టడి౦చిన సంగతిని చారులవలన తెలిసికోనిన పురంజయుడు తానుకూడా సర్వ సన్నద్దుడై యుండెను. అయినను యెదుటి పక్షము వారధి కబలాన్వితులుగా నుండుటయి తాను బలహినుడుగా నుండుటయు విచారించి యే మాత్రము భీతి చెందక శాస్త్ర సమన్విత మైన రథమెక్కి సైన్యాధ పతులను పూరి కొల్పి, చతురంగ బల సమేత మైన సైన్యముతో యుద్ద సన్నద్దుడైన వారిని యెదుర్కొన భేరీ మ్రోగించి, సింహనాదము గావించుచు మేఘములు గర్జించునట్లు హు౦కరించి, శత్రు సైన్యములు పైబడెను.

ఇట్లు స్కాంద పురాణాతర్గ త వశిష్ట ప్రోక్త కార్తీక మహత్మ్య మందలి 'వింశాధ్యాయము - ఇరవయ్యవ రోజు పారాయణం' సమాప్తము.

Link: https://www.youtube.com/post/UgxDjyeIjbM_jIvqOX94AaABCQ

Post a Comment

© Copyright Maheedhar's Planet Leaf | Designed by OddThemes