అమావాస్య రోజున పితృదేవతలకు పిండప్రదానం!


అమావాస్య రోజున పితృదేవతలకు పిండప్రదానం ఎందుకు చేయాలి?

జ్యోతిషశాస్త్ర ప్రకారంగా, సూర్యునిలో చంద్రుడు కలిసిపోతాడు కాబట్టి, ఆ రోజు రాత్రి చీకటి ఏర్పడుతుంది. అమావాస్య అంటే, ఆధ్యాత్మిక తత్వంలో ఎంతో గొప్పది. హిందూ పురాణాల ప్రకారం, ఆకాశంలో చంద్రుడు కనబడని రోజుని, అమావాస్య అని కొంత మంది నమ్ముతారు. అంతేకాదు, ఆ రోజున ఎలాంటి పనులు చేపట్టినా, విజయవంతం కావు అనేది కొంత మంది విశ్వాసం. అమావాస్య పూజ చేయాల్సిందేనా? పితృదేవతలకు శ్రాద్ధం ఇవ్వాల్సిందేనా? అని కొంత మందికి సందేహాలు కలుగుతాయి. అమావాస్య పూజ చేయడం వలన, శుభ ఫలితాలను ఇస్తుంది. జీవితంలో సుఖ సంతోషాలను ప్రసాదిస్తుంది.

[ అద్భుతమైన శనీశ్వరుడి చరిత్ర! = https://youtu.be/qXPHHrAPYf8 ]

సృష్టికి పూర్వం స్వయంభువుగా వెలసిన వేదపిత, సృష్టికర్త శ్రీమద్ విరాట్ విశ్వకర్మ భగవానుని వంశజులైన విశ్వబ్రాహ్మణులు, వైశ్వకర్మణీయులు, నియమనిష్టాగరిష్టులు, ఈ అమావాస్య రోజును ఎంతో పవిత్రంగా భావిస్తారు. వారి కులదైవాలైన విశ్వకర్మ భగవానునీ, వేదమాత గాయత్రి అమ్మవారినీ, బ్రహ్మం గారినీ నిష్టగా పూజించి, ఆ రోజున పరిపూర్ణమైన ఆధ్యాత్మిక చింతనతో ఉంటారు. సృష్టికి ప్రతిసృష్టిని సృష్టించే కులవృత్తి పనిముట్లను శుభ్రపరచుకుని, వాటిని పూజించి, అమావాస్య రోజు కులవృత్తులకు సెలవు ప్రకటించుకుంటారు. సాధారణంగా విశ్వబ్రాహ్మణేతరులు, అమావాస్య రోజున శనిదేవుడిని కూడా పూజిస్తారు. తిలలు, నూనెతో అభిషేకం చేస్తారు. పేదలకు అన్నదానం, వస్త్రదానం చేయడం వల్ల, గత జన్మలో పాపాలు తొలగిపోతాయని భావించి, దాన ధర్మాలు చేసే వారు చేస్తారు.

పితృదేవతలు మన శ్రేయస్సును కోరుకుంటారు కాబట్టి, అమావాస్య రోజున వారికి పిండ ప్రధాన పూజ చేయడం, శుభ ఫలితాలను ఇస్తుంది. జీవితంలో సుఖ సంతోషాలను ప్రసాదిస్తుంది. ఇంట్లో పూజగదిని శుభ్రం చేసుకుని, పితృదేవతలకు భోజనాన్ని నైవేధ్యంగా సమర్పించాలి. ఈ అన్నాన్ని కాకులకు పెట్టాలి. ఇలా చేయడం ద్వారా, అమావాస్య రోజున కాకుల రూపంలో, పితృదేవతలు మనం సమర్పించిన ఆహారాన్ని తీసుకుంటారని, పెద్దలు చెబుతారు. ప్రతి అమావాస్యకూ పితృదేవతలకు పిండాలు పెడితే, వారు సంతోషిస్తారు. సాధారణంగా పితృదేవతలు ఏడుగణాలుగా వుంటారనీ, తొలి మూడు గణాల దేవతలూ అమూర్తులుగా.. అంటే, ఆకారం లేని వారుగా ఉంటారని, శాస్త్రాల ద్వార తెలుస్తోంది. మిగిలిన నాలుగు గణాలైన వారికి మాత్రం, ఆకారాలుంటాయి. పితృగణాలు దేవుళ్లతో కలిసి, శ్రాద్ధాన్ని భుజిస్తారానీ, భోజనంతో సంతృప్తి చెంది, శ్రాద్ధదాతకు, సుఖ, సంతోషాలను ప్రసాదిస్తారనీ, ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి.

పితృదేవతలను సంతృప్తి పరిస్తే.. ఆ కుంటుంబంలో తప్పకుండా అష్టైశ్వర్యాలూ కలిగి, ఈతి బాధలు తొలగి పోతాయని, శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే, అమావాస్య రోజున మధ్యాహ్నం 12 గంటలలోపు, పితృదేవతలను పూజించి, వారికి శ్రాద్ధం ఇవ్వాలి. పెద్దలను స్మరించుకుని, ఆవులూ, కాకులూ, కుక్కలకూ ఆహారం పెట్టడం వలన, వారు సంతృప్తి చెందుతారు.

శాస్త్ర ప్రకారం, ఈ సమయంలో పూర్వీకుల శాంతి కోసం, శ్రద్ధతో ఏవైనా ఆచారపరమైన పనులు చేయడం వల్ల ప్రయోజనం చేకూరుతుందని, చాలా మంది నమ్మకం. ఆ రోజున ఉపవాసం ఉంటే, మన పూర్వీకుల బాధలను తీర్చడమే గాక, రాహు బలహీనత, మరియు వంధ్యత్వం నుండి ఉపశమనం పొందడంలో కూడా సహాయపడుతుంది. పితృ ఋణం పెంచుకోవడం శ్రేయస్కరం కాదు. వీటి వలన, అనేక సమస్యలు ఉత్పన్నమౌతాయి. కుటుంబ సమస్యలు, ఆలస్య వివాహాలు, సంతానం కలగక పోవడం, వ్యవహార సమస్యలు, మొదలైన అనేక ఆటుపోట్లతో జీవితం సాగుతుంది.

సర్వేజనాః సుఖినోభవంతు!

Link: https://www.youtube.com/post/UgzydGgRFiD-1JYdJqB4AaABCQ

Post a Comment

© Copyright Maheedhar's Planet Leaf | Designed by OddThemes